7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మేడినేని వినీత ముమ్మర ప్రచారం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 08:
7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మేడినేని వినీత ముమ్మర ప్రచారం
హుజూరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఇందులో భాగంగా 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేడినేని వినీత (భర్త గన్నారపు శ్రీకాంత్ – బట్టికాడ) తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. “మన వార్డు.. మన ఓటు.. మన నాయకురాలు” అనే నినాదంతో ఆమె ఓటర్లను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. M.B.B.S చదివిన విద్యావంతురాలైన వినీత, వార్డులోని మౌలిక వసతుల కల్పన మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి, సిసి రోడ్ల నిర్మాణం మరియు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచి, 7వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆమె ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నారు.
ఈ ప్రచారంలో టీఎంపీఎస్ (TMPS) జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు తునికి సమ్మయ్య తదితరులు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ హస్తం గుర్తుకు మద్దతు సేకరిస్తున్నారు. విద్యావంతురాలైన అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారానే వార్డు ప్రగతి సాధ్యమని, ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వారు వివరిస్తున్నారు. ఫిబ్రవరి 11, బుధవారం రోజున జరగనున్న ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి, సీరియల్ నంబర్ 3 వద్ద తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వినీత కోరుతున్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.