బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 26: వినాయక చవితి పండుగ సందర్భంగా హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామంలోని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు చేసిన విన్నపానికి జయన్న ఫౌండేషన్ ఛైర్మన్, సింగపూర్ వాసి గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న తక్షణమే స్పందించి, సుమారు రూ. 28,000 విలువైన 500 వాట్స్ ఆంప్లిఫైయర్ను (Amplifier) బహూకరించారు.
కాట్రపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయకుడిని ప్రతిష్ఠించే హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు, తమ కార్యక్రమాల కోసం ఒక మంచి ఆంప్లిఫైయర్ అవసరమని కోరారు. అదే సమయంలో గ్రామంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వృద్ధుల కోసం మెగా హెల్త్ శిబిరం నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి మరియు గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న దృష్టికి ఈ విషయాన్ని యూత్ సభ్యులు తీసుకువచ్చారు.
యువకుల కోరికను ఆలకించిన దాత గుడిపాటి జైపాల్ రెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే హైదరాబాద్ నుండి రూ. 28,000 ఖర్చుతో 500 వాట్స్ ఆంప్లిఫైయర్ను కొనుగోలు చేసి, గురు వారం రోజు సాయంత్రం గ్రామంలోని యూత్ అసోసియేషన్ సభ్యులకు అందజేసి వెళ్లారు.యూత్ అసోసియేషన్ కోరిక మేరకు వెంటనే స్పందించి, ఇంతటి విలువైన పరికరాన్ని అందించిన సింగపూర్ వాసి, దాతృత్వ హృదయులు గుడిపాటి జైపాల్ రెడ్డి అన్నగారికి మరియు జయన్న ఫౌండేషన్కు కాట్రపల్లి గ్రామ ప్రజలు, హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. జయన్న ఫౌండేషన్ సామాజిక సేవ మరియు దాతృత్వంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.











