జయన్న ఫౌండేషన్ దాతృత్వం: కాట్రపల్లి హనుమాన్ యూత్ అసోసియేషన్‌కు రూ. 28 వేల ఆంప్లిఫైయర్ బహుమతి

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 26: వినాయక చవితి పండుగ సందర్భంగా హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామంలోని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు చేసిన విన్నపానికి జయన్న ఫౌండేషన్ ఛైర్మన్, సింగపూర్ వాసి  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న తక్షణమే స్పందించి, సుమారు రూ. 28,000 విలువైన 500 వాట్స్ ఆంప్లిఫైయర్‌ను (Amplifier) బహూకరించారు.

కాట్రపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయకుడిని ప్రతిష్ఠించే హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు, తమ కార్యక్రమాల కోసం ఒక మంచి ఆంప్లిఫైయర్ అవసరమని కోరారు. అదే సమయంలో గ్రామంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వృద్ధుల కోసం మెగా హెల్త్ శిబిరం నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి మరియు  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్న దృష్టికి ఈ విషయాన్ని యూత్ సభ్యులు తీసుకువచ్చారు.

యువకుల కోరికను ఆలకించిన దాత  గుడిపాటి జైపాల్ రెడ్డి  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే హైదరాబాద్ నుండి రూ. 28,000 ఖర్చుతో 500 వాట్స్ ఆంప్లిఫైయర్‌ను కొనుగోలు చేసి, గురు వారం రోజు సాయంత్రం గ్రామంలోని యూత్ అసోసియేషన్ సభ్యులకు అందజేసి వెళ్లారు.యూత్ అసోసియేషన్ కోరిక మేరకు వెంటనే స్పందించి, ఇంతటి విలువైన పరికరాన్ని అందించిన సింగపూర్ వాసి, దాతృత్వ హృదయులు  గుడిపాటి జైపాల్ రెడ్డి అన్నగారికి మరియు జయన్న ఫౌండేషన్‌కు కాట్రపల్లి గ్రామ ప్రజలు, హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. జయన్న ఫౌండేషన్ సామాజిక సేవ మరియు దాతృత్వంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….