బాహుబలం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి మార్చి 01; శని వారంరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలో దారుణ హత్య కు గురికాబడిన.సామాజికవేత్త మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ లోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కుటుంబాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ శనివారం పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతప్పు చేసింది ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని మరియు ఈ కేసును సిబిసిఐడి తో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూయించి తక్షణమే చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హత్య రాజకీయాలు సమాజానికి మంచిది కాదు ఇది మంచి అలవాటు కాదు దీని తక్షణమే పోలీసు అధికారులు ప్రభుత్వము అడ్డుకట్ట వేయాలి అని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని అన్నివేళలా తమ కుటుంబానికి మా వంతుగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేయడమైనది భగవంతుడు రాజలింగమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని అన్నారు.










