బాహు బలం న్యూస్ ప్రతినిధి ఎల్కతుర్తి.
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో పాఠశాలలో ప్రిన్సిపాల్ పాకాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సివీ రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సైన్స్ ఎక్స్ పో (ఎగ్జిబిషన్) ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సైన్స్ మనిషి జీవితంలో ఒక భాగమని స్పష్టం చేశారు. విజ్ఞాన శాస్త్రానికి సీవీ రామన్ చేసిన సేవలను గుర్తు చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చని అన్నారు. సివి రామన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ రజనీకాంత్, సి బ్యాచ్ ఇంచార్జీ మధు, ప్రైమరీ ఇంచార్జీ గౌసియా, ప్రీ ప్రైమరీ ఇంచార్జీ ప్రతిమ, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










