బాహు బలంన్యూస్ హుజూరాబాద్ టౌన్: నిరుపేదలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అమలు చేస్తోందని హుజూరాబాద్ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ బొరగాల మొగిలి-లక్ష్మి దంపతులు పేర్కొన్నారు. బుధవారం వార్డు పరిధిలోని లబ్ధిదారులు పర్లపెల్లి సుమలత-సదానందం నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలని, అందులో అత్యంత కీలకమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని చెప్పారు. అర్హులైన పేద ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధికారి లత, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మొలుగు రాధ, యూత్ కాంగ్రెస్ నాయకులు రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్ మరియు స్థానిక యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు











