అంగరంగ వైభవంగా… హైదరాబాదులో హుజురాబాద్ ఎన్నారై వివాహ రిసెప్షన్ రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్,ఫిబ్రవరి 26 : హుజురాబాద్ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ పోతిరెడ్డి రాహుల్ వివాహ రిసెప్షన్ హైదరాబాదు బాచుపల్లి లోని కే జీ ఆర్ కన్వెన్షన్ లో మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. రాహుల్ తండ్రి పోతిరెడ్డి శ్రీనివాస్ హుజురాబాద్ పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థి కావడంతో పాటు, హైదరాబాదు పటాన్చెరు లోని ప్రఖ్యాత తోషిబా టీ అండ్ డి సిస్టమ్స్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.పోతిరెడ్డి శ్రీనివాస్ మిత్రులైన 1981-1982 హుజురాబాద్ శిశు మందిర్ ఏడవ తరగతి బ్యాచ్, 1982-1985 ప్రభుత్వ హైస్కూల్, 1985-88 హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బ్యాచ్, 1988-92 వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సమావేశం లా వివాహ రిసెప్షన్ తలపించింది. హుజురాబాద్ హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ పట్టణాల నుండి శ్రీనివాస్ మిత్రులు శ్రేయోభిలాషులు రిసెప్షన్కు హాజరయ్యారు. వధూవరులు రాహుల్ రోహిణి దంపతులను అభినందించి ఆశీర్వదించారు. పోతిరెడ్డి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు పలువురు తోషిబా కంపెనీ ప్రతినిధులు జపాన్ నుండి ప్రత్యేకంగా హాజరై రిసెప్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిన్లాండ్ నుండి వచ్చిన యువజంట అందరిని ఆకట్టుకున్నారు. పలువురు విదేశీయులు, పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కూడా రిసెప్షన్కు హాజరయ్యారు. రిసెప్షన్లో పూర్వ విద్యార్థుల సందడి కనిపించింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్న మిత్రులు ఫోటోలు సెల్ఫీలు తీసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. వివాహ రిసెప్షన్ లో ఐఏఎస్ అధికారి కోరెం అశోక్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, వరంగల్ కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె అశోక్ రెడ్డి, హైదరాబాద్ పోస్టల్ శాఖ ఉన్నతాధికారి అక్కు శ్రీనివాస్, ఇన్ఫార్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో గంగిశెట్టి రాఘవేందర్, రిటైర్డ్ డిప్యూటీ డిఇఓ ఆలేటి మదన్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..