భారతీయ కళాకార్ సంఘ్ (జాతీయ సంస్థ) తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా సాగంటి మంజుల నియామకం..

సబ్బనివెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హమ్మకొండ:
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు లో ఆదివారం సాయంత్రం జరిగిన భారతీయ కళాకార్ సంఘ్ జాతీయ ఆర్టీస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్బంగా ఆర్టీస్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.అందులో భాగంగా చిత్రకళ రంగం లో కొత్త తరాన్ని తయారు చేస్తున్న గురువులకు ఘనమైన సన్మానం చేసారు తెలంగాణ రాష్ట్రం నుండి హన్మకొండ కి చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ & డైరెక్టర్ సాగంటి మంజుల చిత్రకళకి చేస్తున్న సేవని గుర్తించి ఆహ్వానం పలికి ఘనంగా సత్కరించి తెలంగాణ మహిళా విభాగం లో ప్రధాన కార్యదర్శి బాధ్యతను అప్పగించి అధికారికంగా నగర మాజీ మేయర్ శాంతి కుమారి,సినిమా డైరెక్టర్ సాయి ప్రకాష్,సంస్థ ఫౌండర్ అంకూర్,జాతీయ అధ్యక్షులు కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమం లో తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ ఆర్టీస్టులు పాల్గొన్నారు. ఈ నియామకం పై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్ తో పాటు అతని కార్యవర్గం హర్షం వ్యక్తం చేసి మంజులను అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !