బాహు బలంన్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 03:
కాంగ్రెస్ ప్రభుత్వ ‘వెయ్యి రోజుల దగా పాలన’ను ఎండగడుతూ చేపట్టిన బీఆర్ఎస్ సమరభేరిలో ఓసీ జేఏసీ (OC JAC) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సాగే ఆందోళనలు, నిరసనల్లో భాగంగా హుజురాబాద్ మండలంలో ఆమె ఆధ్వర్యంలో సమర శంఖారావం పూరించారు.
చేతిలో కాగడా (దివిటీ) పట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల గళాన్ని వినిపించేందుకు ప్రభావతి రెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని, మహిళా సాధికారతను విస్మరించిందని ఆమె మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
హుజురాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులను, మహిళా లోకాన్ని సమాయత్తం చేస్తూ ఈ వారం రోజుల పాటు జరిగే నిరసన ప్రదర్శనలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి ఈ సమరభేరి ద్వారా తగిన గుణపాఠం చెబుతామని పూసల ప్రభావతి రెడ్డి స్పష్టం చేశారు.











