బాహు బలంన్యూస్, మానకొండూరు ఆగస్టు 26,:మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ నాయకుడు రెడ్డి సంపత్ రెడ్డి – మాజీ ఎంపీటీసీ రెడ్డి కల్యాణి దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ప్రణీతల వివాహం చల్లూరులోని ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరుడి తండ్రి రెడ్డి సంపత్ రెడ్డి, వధువు తండ్రి పాకాల శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Post Views: 32









