బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 17 :
పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా రైలింగ్స్కు రాజకీయ పార్టీల జెండాలు, నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏఐఏవైఎస్) డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం విశాల్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
రైలింగ్స్పై విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టడం వల్ల చౌరస్తా స్వరూపం దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్కు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని విశాల్ తెలిపారు. వెంటనే వాటిని తొలగించి, భవిష్యత్తులో ఎవరూ ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ (DCSO) ఇన్ఛార్జ్, ఎంపీడీవో, తహసీల్దార్ (MRO), మున్సిపల్ కమిషనర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.













