బాహు బలంన్యూస్ హుజురాబాద్,:
గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారార్థం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న హైటెక్నాలజీ వాటర్ ప్లాంట్ పనులకు ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
సొంత నిధులతో అత్యాధునిక ప్లాంట్
కార్యక్రమంలో సరిత జయపాల్రెడ్డి మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రాంపూర్లో సరైన వాటర్ ప్లాంట్ లేక గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సొంత ఖర్చులతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు హామీ ఇచ్చారు.
గ్రామస్థుల హర్షం
ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుండటంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఉపసర్పంచ్ శివాజీ, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











