హుజురాబాద్, బాహు బలంన్యూస్ ఆగస్టు 16 : గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న హైటెక్నాలజీ వాటర్ ప్లాంట్కు ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను గుర్తించి సొంత ఖర్చులతో అత్యాధునిక ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తీరనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, ఉపసర్పంచ్ శివాజీ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Views: 2










