ప్రజల మనిషి.. ప్రజా పోలీస్.. రూరల్ సీఐ శ్రీనివాస్‌కు నీరాజనం.. – పద్మశాలి సంఘం, బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం – సామాన్యుడికి న్యాయమే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్ష…

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రజల మనిషి.. ప్రజా పోలీస్.. రూరల్ సీఐ శ్రీనివాస్‌కు నీరాజనం.. – పద్మశాలి సంఘం, బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం – సామాన్యుడికి న్యాయమే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్ష…

బాహు బలంన్యూస్ ,హుజురాబాద్, మే 15:

హుజురాబాద్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం, బి.సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనల జల్లు కురిపించారు. విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మరపురాని సేవలు.. సామాన్యుడికి భరోసా..

ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ టౌన్ ఎస్ఐగా శ్రీనివాస్ అందించిన సేవలు అజరామరమని కొనియాడారు. "అధికారం కంటే బాధ్యతకే ఆయన ప్రాముఖ్యతనిచ్చారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను పక్కన పెట్టి, సామాన్య ప్రజలకు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచి, వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించిన తీరు స్ఫూర్తిదాయకం" అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల మెప్పు పొందిన అధికారిగా ఆయన రూరల్ పరిధిలోనూ అదే పంథాను కొనసాగించాలని కోరారు.

శాంతి భద్రతలే లక్ష్యం.. న్యాయమే మార్గం..

రూరల్ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు, అమాయక ప్రజలకు చట్టం పట్ల నమ్మకాన్ని కలిగించేలా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని నేతలు ఈ సందర్భంగా విన్నవించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలోనూ, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల అదుపులోనూ సీఐ తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ముందుకు సాగాలని వారు కోరారు.

తరలివచ్చిన సంఘం శ్రేణులు..

ఈ సాదర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం, బి.సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్ పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వారితో పాటు హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి రమేష్, మాడుగుల ఓదెలు, నడిగోటి రమేష్, బూర్ల చంద్రమౌళి, కొలిపాక క్రాంతి కుమార్, మామునూరి ప్రవీణ్, పంజాల వెంకటేశ్వర్లు, సొల్లు సల్మోహన్ తదితర ముఖ్య నేతలు పాల్గొని సీఐని అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ ,హుజురాబాద్, మే 15:

హుజురాబాద్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం, బి.సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనల జల్లు కురిపించారు. విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మరపురాని సేవలు.. సామాన్యుడికి భరోసా..

ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ టౌన్ ఎస్ఐగా శ్రీనివాస్ అందించిన సేవలు అజరామరమని కొనియాడారు. “అధికారం కంటే బాధ్యతకే ఆయన ప్రాముఖ్యతనిచ్చారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను పక్కన పెట్టి, సామాన్య ప్రజలకు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచి, వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించిన తీరు స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల మెప్పు పొందిన అధికారిగా ఆయన రూరల్ పరిధిలోనూ అదే పంథాను కొనసాగించాలని కోరారు.

శాంతి భద్రతలే లక్ష్యం.. న్యాయమే మార్గం..

రూరల్ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు, అమాయక ప్రజలకు చట్టం పట్ల నమ్మకాన్ని కలిగించేలా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని నేతలు ఈ సందర్భంగా విన్నవించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలోనూ, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల అదుపులోనూ సీఐ తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ముందుకు సాగాలని వారు కోరారు.

తరలివచ్చిన సంఘం శ్రేణులు..

ఈ సాదర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం, బి.సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్ పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వారితో పాటు హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి రమేష్, మాడుగుల ఓదెలు, నడిగోటి రమేష్, బూర్ల చంద్రమౌళి, కొలిపాక క్రాంతి కుమార్, మామునూరి ప్రవీణ్, పంజాల వెంకటేశ్వర్లు, సొల్లు సల్మోహన్ తదితర ముఖ్య నేతలు పాల్గొని సీఐని అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…