మధ్యప్రదేశ్‌లో ‘ఆది ఉత్సవ్’.. హోరెత్తిన తెలంగాణ లంబాడీ నృత్యం …. ​రాంనగర్ మోతీ మహల్ వేదికగా గిరిజన కళావైభవం ​.. సైదాపూర్ కళాకారుల ప్రతిభకు కేంద్ర మంత్రుల ప్రశంసలు…

హుజురాబాద్/సైదాపూర్ స్వేచ్ఛ:మే 15:
భారతీయ గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా మధ్యప్రదేశ్ రాష్ట్రం మండ్ల జిల్లాలోని బీచియా తాలూకాలో గల పవిత్ర నర్మదా నది తీరాన ‘ఆది ఉత్సవ్’ సంబరాలు అంబరాన్నంటాయి. చారిత్రక రాంనగర్ మోతీ మహల్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పేలా నిర్వహించిన లంబాడీ గిరిజన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ ప్రాభవం – సైదాపూర్ కళాకారుల నృత్యం..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలాబోతారం గ్రామానికి చెందిన నమిండ్ల మధు నేతృత్వంలోని కళాకారుల బృందం ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకుంది. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, లయబద్ధమైన అడుగులతో వారు చేసిన లంబాడీ నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ మట్టి వాసనను, గిరిజన జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనకు సభికుల నుండి విశేష స్పందన లభించింది.
దేశవ్యాప్త కళాకారుల సంగమం
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొని తమ తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఈ కళాకారుల ప్రదర్శనలు భారతీయ గిరిజన సంస్కృతి యొక్క ఐక్యతను చాటిచెప్పాయి.
​ముఖ్య అతిథుల అభినందనలు
ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కళాకారుల ప్రదర్శనలను తిలకించిన అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. గిరిజన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి వేదికలు కళాకారులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయని వారు పేర్కొన్నారు.
​తెలంగాణ గడ్డపై నుంచి వెళ్లిన ఎలాబోతారం కళాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి రాష్టానికి పేరు తీసుకురావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…