రైతు హామీలను పడకేసిన రేవంత్ సర్కార్: రైతు ప్రజాసంఘాల సమాఖ్య ధ్వజం. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,

బాహు బలంన్యూస్ కరీంనగర్, మార్చి 21:
తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్, క్షేత్రస్థాయిలో అన్నదాతలను ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో ఉమ్మడి జిల్లా రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు ఇచ్చిన చాలా హామీలను కనీసం ప్రస్తావించలేదని వారు మండిపడ్డారు.
బడ్జెట్‌లో రైతాంగానికి మొండిచేయి
కౌలు రైతులకు సాగు సాయం అందిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో వారి ఊసే ఎత్తలేదని రామారావు, రాంరెడ్డి విమర్శించారు. రూ. 2 లక్షల పూర్తి స్థాయి రుణమాఫీకి అవసరమైన నిధుల కేటాయింపుపై స్పష్టత లేదని, అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం రైతుల్ని వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు విడతలుగా రైతు భరోసా నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వారు ఘాటుగా విమర్శించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినా దానికి నిధులు ఇవ్వకుండా, పాలక మండలిని నియమించకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’
ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్ష మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి’ సభను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ లోగా ఓసి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీ చేపడతామని హెచ్చరించారు. రైతు పండించిన పంటలకు క్వింటాల్‌కు రూ. 3,000 చెల్లించాలని, రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పెన్షన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జూన్నూతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, దడిగల వెంకటేశ్వర్ రావు, అయిత నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !