పట్టణంలోని 29వ వార్డులో అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి .

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి13 : పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహసిని మరియు వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి శుక్ర వారం పర్యటించారు. వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన చైర్‌పర్సన్, కేంద్రంలోని వంటగదిని మరియు నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. “చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని” ఆమె ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని వంట మనుషులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోరగాల కవిత, స్వర్ణలత, అంగన్‌వాడీ సూపర్వైజర్, టీచర్ రొంటాల పద్మ, ఆర్పీలు బోరగాల రమ, ఎర్ర వినోద, ఆశా వర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….