అభివృద్ధి ధ్యేయంగా కూతాడి కుమారస్వామి ఎన్నికల ప్రచారం.

హుజూరాబాద్, ఫిబ్రవరి 04 (బాహుబలం న్యూస్): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో 15వ వార్డు బీజేపీ అభ్యర్థి కూతాడి కుమారస్వామి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం వార్డులో నిర్వహించిన భారీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కుమారస్వామికి మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కూతాడి కుమారస్వామి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వార్డులో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి అన్ని సమస్యలను పరిష్కరించి, వార్డును సమస్యల రహితంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనాదిగా రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న ఎరుకల సామాజిక వర్గం నుంచి మున్సిపల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అభ్యర్థి పోటీకి దిగడం ఆత్మగౌరవ పోరాటమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక స్పృహ కలిగిన కుమారస్వామి వంటి నాయకుడిని గెలిపించుకోవడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ గుర్తింపు దక్కాలనే లక్ష్యంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు మరియు ఎరుకల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..