కాట్రపల్లిలో ఘనంగా ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ పంపిణీ

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో ఘనంగా ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ పంపిణీ

బాహుబలం న్యూస్, హుజూరాబాద్, ఫిబ్రవరి 01 :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ (స్వర్ణ బిందు ప్రాశన) పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. స్థానిక శ్రీ రామాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో గోమతి విద్య గోశాల గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తోగరు కుమార స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా - బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్  స్వయంగా చిన్నారులకు ఆయుర్వేద ఔషధ చుక్కలను వేసి ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయుర్వేద శాస్త్రం అందించిన ఈ అద్భుత ఔషధాన్ని గ్రామంలోని పిల్లలందరికీ అందజేయడం అభినందనీయమని, దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు.

ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో 6 నెలల నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు స్వర్ణ భస్మం, అష్ట మంగళ ఘృతం, తేనె వంటి అరుదైన మూలికలతో కూడిన ఔషధాన్ని వేశారు. ఈ ఔషధం ద్వారా జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, చిన్నారులను వేధిస్తున్న హైపర్ యాక్టివిటీ (ADHD), ఆటిజం వంటి సమస్యల నివారణకు ఇది ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం 9908860578 లేదా 9063470111 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్, హుజూరాబాద్, ఫిబ్రవరి 01 :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉచిత ‘స్వర్ణామృత ప్రాశన’ (స్వర్ణ బిందు ప్రాశన) పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. స్థానిక శ్రీ రామాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో గోమతి విద్య గోశాల గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తోగరు కుమార స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా – బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్  స్వయంగా చిన్నారులకు ఆయుర్వేద ఔషధ చుక్కలను వేసి ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయుర్వేద శాస్త్రం అందించిన ఈ అద్భుత ఔషధాన్ని గ్రామంలోని పిల్లలందరికీ అందజేయడం అభినందనీయమని, దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు.

ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో 6 నెలల నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు స్వర్ణ భస్మం, అష్ట మంగళ ఘృతం, తేనె వంటి అరుదైన మూలికలతో కూడిన ఔషధాన్ని వేశారు. ఈ ఔషధం ద్వారా జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, చిన్నారులను వేధిస్తున్న హైపర్ యాక్టివిటీ (ADHD), ఆటిజం వంటి సమస్యల నివారణకు ఇది ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం 9908860578 లేదా 9063470111 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.