క్రీడలతోనే బంగారు భవిష్యత్తు: సర్పంచ్ వంతడుపుల కస్తూరి

హుజురాబాద్ బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 22: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెల్పూర్ గ్రామ సర్పంచ్ మరియు క్రీడోత్సవాల కమిటీ చైర్మన్ వంతడుపుల కస్తూరి పిలుపునిచ్చారు. గురువారం చెల్పూర్ గ్రామంలో క్లస్టర్ లెవెల్ (చెల్పూర్, రాంపూర్, రాజపల్లి, శాల్లపల్లి, ఇందిరానగర్) సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడోత్సవాలను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని, క్రీడల వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నేటి యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలకు బానిసలుగా మారి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆమె హితవు పలికారు. తల్లిదండ్రుల, గురువుల ఆశయాలను నెరవేరుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి జయేందర్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పంజాల జ్యోతి, ఎండి రహీం, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..