క్రీడలతోనే బంగారు భవిష్యత్తు: సర్పంచ్ వంతడుపుల కస్తూరి

హుజురాబాద్ బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 22: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెల్పూర్ గ్రామ సర్పంచ్ మరియు క్రీడోత్సవాల కమిటీ చైర్మన్ వంతడుపుల కస్తూరి పిలుపునిచ్చారు. గురువారం చెల్పూర్ గ్రామంలో క్లస్టర్ లెవెల్ (చెల్పూర్, రాంపూర్, రాజపల్లి, శాల్లపల్లి, ఇందిరానగర్) సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడోత్సవాలను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని, క్రీడల వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నేటి యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలకు బానిసలుగా మారి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆమె హితవు పలికారు. తల్లిదండ్రుల, గురువుల ఆశయాలను నెరవేరుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి జయేందర్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పంజాల జ్యోతి, ఎండి రహీం, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….