కాట్రపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం: 125 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 27:
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య ఆరోగ్య మరియు పునరుత్పత్తి శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పశుగణాభివృద్ధి వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా బిక్షపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ఉచిత వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని గ్రామంలో పాల ఉత్పత్తిని పెంపొందించాలని కోరారు. అనంతరం సింగపూర్ పశువైద్యాధికారి డాక్టర్ పి. రవీందర్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పశువులలో వచ్చే గర్భకోశ సమస్యల వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, శాస్త్రీయ పద్ధతులలో పశువులను పోషించడం ద్వారా పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని సూచించారు.
ఈ శిబిరంలో సుమారు 125 పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వాటికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పునరుత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పశువులకు ప్రత్యేక చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, జమ్మికుంట పశువైద్యాధికారి రాజ్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్ గంగాదారి బిక్షపతి, గోపాల మిత్ర సూపర్వైజర్ రామ్ రెడ్డి, గోపాల మిత్రులు పెరుమాళ్ళ రవీందర్, రమేష్ మరియు గ్రామంలోని అధిక సంఖ్యలో రైతులు తమ పశువులతో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..