మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన యూత్ కాంగ్రెస్ నేత గాలిబ్ నరేష్..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జనవరి 09:
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గాలిబ్ నరేష్ శుక్రవారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని 19వ వార్డు రాజకీయ పరిణామాలు మరియు ప్రజా సమస్యలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో తనకు 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని గాలిబ్ నరేష్ మంత్రిని కోరారు.
వార్డులో పార్టీ బలోపేతానికి తాము నిరంతరం శ్రమిస్తున్నామని, వోడితల ప్రణవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. 19వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, పార్టీ కోసం కష్టపడే యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటూ, ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !