హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా పంజాల రాజు ఏకగ్రీవ ఎన్నిక

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జనవరి 07 :హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా బోత్తలపల్లి గ్రామ ఉపసర్పంచ్ శ్రీ పంజాల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపసర్పంచుల ప్రత్యేక సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన పంజాల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండలంలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల హక్కుల కోసం, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉపసర్పంచులకు సముచిత గౌరవం దక్కేలా చూస్తానని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఫోరమ్ బలోపేతానికి పాటుపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంజాల రాజుకు మద్దతుగా నిలిచిన వారిలో చెల్పూర్ ఉపసర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, శాలాపల్లికి చెందిన అశోక్ కుమార్, జూపాక నుండి గిన్నారపు మహేందర్, వెంకట్రావుపల్లి నుండి అవుల సంపత్, పోతిరెడ్డిపేట ఉపసర్పంచ్ అజయ్, మందాడిపల్లికి చెందిన సుధాకర్, తుమ్మనపల్లి నుండి శ్రీకాంత్ రెడ్డి, సింగపూర్ ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి, కాట్రపల్లి నుండి బిక్షపతి, కనుకిలాగిద్దె నుండి బాలరాంరెడ్డి, రంగాపూర్ నుండి నరేష్ మరియు రాజపల్లి ఉపసర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పంజాల రాజును పలువురు నాయకులు, తోటి ఉపసర్పంచులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….