హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా పంజాల రాజు ఏకగ్రీవ ఎన్నిక

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జనవరి 07 :హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా బోత్తలపల్లి గ్రామ ఉపసర్పంచ్ శ్రీ పంజాల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపసర్పంచుల ప్రత్యేక సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన పంజాల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండలంలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచుల హక్కుల కోసం, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉపసర్పంచులకు సముచిత గౌరవం దక్కేలా చూస్తానని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఫోరమ్ బలోపేతానికి పాటుపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంజాల రాజుకు మద్దతుగా నిలిచిన వారిలో చెల్పూర్ ఉపసర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, శాలాపల్లికి చెందిన అశోక్ కుమార్, జూపాక నుండి గిన్నారపు మహేందర్, వెంకట్రావుపల్లి నుండి అవుల సంపత్, పోతిరెడ్డిపేట ఉపసర్పంచ్ అజయ్, మందాడిపల్లికి చెందిన సుధాకర్, తుమ్మనపల్లి నుండి శ్రీకాంత్ రెడ్డి, సింగపూర్ ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి, కాట్రపల్లి నుండి బిక్షపతి, కనుకిలాగిద్దె నుండి బాలరాంరెడ్డి, రంగాపూర్ నుండి నరేష్ మరియు రాజపల్లి ఉపసర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పంజాల రాజును పలువురు నాయకులు, తోటి ఉపసర్పంచులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..