మహిళా లోకానికే ఆదర్శం సావిత్రీబాయి ఫూలే: తిప్పారపు శ్రీనివాస్.

బాహు బలంన్యూస్  చిగురుమామిడి, జనవరి 03: నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి, మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని సామాజిక సేవకుడు తిప్పారపు శ్రీనివాస్ కొనియాడారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్ కుమార్, రేకొండ ఉప సర్పంచ్ బిల్ల సంతోష్ రెడ్డి, సి.ఎలు బోయిని కవిత, కొత్తూరి మంజుల, పిరల్ల శైలజ, వార్డు సభ్యులు దుడ్డేల వసంత, జినుకల అజయ్, కాసాని సతీష్, తాటికొండ అభిషేక్ రెడ్డి, గాజపాక ఉమా, బోయినీ అనిల్, చెంచల నాగరాజు, కారంపురి వెంకటేశం, పందిపెల్లి తిరుపతి, మైలారపు రవి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !