హుజూరాబాద్‌లో ‘క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్’ నూతన బ్రాంచ్ ప్రారంభం: తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాలు

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, డిసెంబర్ 29:
హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ తన నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గందె రాధిక రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రాంచ్ మేనేజర్ మొలుగూరి సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవంలో వేద పండితులు తిరుమలాచార్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేనేజర్ సుమన్ సంస్థ కార్యకలాపాలను అధికారికంగా అందుబాటులోకి తెస్తూ నూతన ఖాతాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గందె రాధిక మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఈ సంస్థ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వినియోగదారులు తమ బంగారు ఆభరణాలపై సురక్షితంగా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ సుమన్ సంస్థ సేవల గురించి వివరిస్తూ, వినియోగదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లతో పాటు, బంగారు ఆభరణాల విలువపై 95 శాతానికి పైగా గరిష్ట రుణాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఎటువంటి దాపరికం లేని పారదర్శకమైన లావాదేవీలు, తక్కువ కాగితపు పనితో నిమిషాల వ్యవధిలోనే రుణాలు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అజయ్, రిలేషన్ షిప్ మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏరియా మేనేజర్ షేక్ సల్మాన్, క్యాప్రి గ్లోబల్ సిబ్బంది, ఇతర అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….