శిథిలమైన బ్రిడ్జిపైనే నిద్రిస్తాం: టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్

బాహు బలంన్యూస్ కేశపట్నం డిసెంబర్ 27,:
మొలంగూర్ గ్రామం నుండి చెమిలాడ బోడుకు వెళ్లే దారిలో గల బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, తక్షణమే నూతన బ్రిడ్జిని నిర్మించకపోతే గ్రామస్తులతో కలిసి బ్రిడ్జిపైనే నిద్రించి నిరసన తెలుపుతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికులతో కలిసి ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి గుండా నిత్యం వందలాది ఎకరాలకు సంబంధించి రైతులు తమ సాగు పనుల కోసం వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ప్రస్తుతం బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడి, పిల్లర్లు నెర్రెలు చాచి ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా కనీసం రక్షణ గోడలు కూడా లేకపోవడంతో, వర్షాకాలంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని మండిపడ్డారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో గ్రామ ప్రజలతో కలిసి బ్రిడ్జిపైనే వంటా-వార్పు కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరపు ఆనంద్, దాసరపు శివ సాయి, మోరే అజయ్, మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !