హుజురాబాద్ మండలం, కాట్రపల్లి 8వ వార్డు ఏకగ్రీవం ముప్పు లావణ్య సహదేవ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 10: : హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యురాలిగా ముప్పు లావణ్య – సహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా 8వ వార్డు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, గ్రామాభివృద్ధి కోసం నిబద్ధత చూపిస్తున్న లావణ్య సహదేవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముప్పు లావణ్య సహదేవ్ మాట్లాడుతూ, కాట్రపల్లి గ్రామాభివృద్ధి కోసం, ముఖ్యంగా 8వ వార్డులో సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు తాను ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ఈ హామీల పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. “నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను,” అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక కాట్రపల్లి గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….