బాహు బలంన్యూస్ హుజురాబాద్/రాంపూర్ డిసెంబర్ 11: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ మూడవ వార్డు ఎన్నికల బరిలో అభ్యర్థి రాం సారయ్య గట్టి పోటీనిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్లలో 5వ నంబర్ వద్ద ఉన్న తమ ఎన్నికల గుర్తు ‘బీరువా’ గుర్తును గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మూడవ వార్డు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని సారయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు ప్రధాన హామీలు ఇచ్చారు.
తాను వార్డు మెంబర్గా గెలిస్తే, వార్డు ప్రజల ప్రధాన సమస్య అయిన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి మురుగునీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి వసతి మరియు వాటర్ సదుపాయాన్ని కల్పించడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వార్డులో అంతర్గత సీసీ రోడ్లు వేయకపోయిన ప్రాంతాలను గుర్తించి, వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. అంతేకాకుండా, వార్డులోని బీసీ సామాజిక వర్గ ప్రజల అవసరాల కోసం ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అన్ని వీధుల్లో వీధి దీపాలు (సీట్ లైట్స్) ఏర్పాటు చేయించి, ప్రజల భద్రతకు భరోసా ఇస్తానని రాం సారయ్య తెలిపారు. ‘బీరువా’ గుర్తుతో బరిలో నిలిచిన రాం సారయ్యకు యువత, మహిళల నుండి మంచి స్పందన లభిస్తోంది. రాంపూర్ మూడవ వార్డులో మార్పు తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు










