బాహు బలంన్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 24:
భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ వర్షిత ఆకస్మిక మృతి పట్ల పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడటంపై గురుకులాల కార్యదర్శులు, ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయి పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.
చనిపోయిన విద్యార్థిని శ్రీ వర్షిత మృతికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వాసు వడ్లూరి విద్యార్థిని కుటుంబం పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.










