గురుకుల విద్యార్థిని శ్రీ వర్షిత మృతిపై న్యాయ విచారణ జరిపించాలి. కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్.

బాహు బలంన్యూస్ ​హుజురాబాద్ అక్టోబర్ 24:
​భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ వర్షిత ఆకస్మిక మృతి పట్ల పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
​శుక్రవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడటంపై గురుకులాల కార్యదర్శులు, ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయి పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.
​చనిపోయిన విద్యార్థిని శ్రీ వర్షిత మృతికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వాసు వడ్లూరి విద్యార్థిని కుటుంబం పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….