బాహు బలంన్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 20:
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన ముంజల గణేష్ కుటుంబాన్ని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ హృదయ విదారక ఘటనతో విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని వారు ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
గ్రామంలో ముంజల గణేష్ హఠాన్మరణం తీరని లోటని సరిత జయపాల్ రెడ్డి అన్నారు. గణేష్ తండ్రి సంపత్ కూడా గతంలో విద్యుత్ షాక్తో మరణించిన విషాదం మరువక ముందే, ఇప్పుడు గణేష్ చనిపోవడం అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు.
ఈ కష్ట సమయంలో తాను, తమ ఫౌండేషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా, జయన్న ఫౌండేషన్ తరపున తక్షణ సహాయంగా రూ. 5000 (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి సరిత జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, మృతుడు గణేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి భవిష్యత్తులోనూ తమ ఫౌండేషన్ ద్వారా చేయగలిగిన సహాయం అందిస్తామని, ముఖ్యంగా ఆరోగ్య పరమైన అవసరాల విషయంలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
జయన్న ఫౌండేషన్ సేవలను, ముఖ్యంగా కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి దాతృత్వాన్ని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రశంసించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










