బాహుబలంన్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 27:మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విజయ్ కుమార్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కొనియాడారు. పేదవారికి తోచిన సహాయం చేస్తూ, సేవా భావమే జీవిత లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. మున్సిపల్ చైర్మన్గా తన హయాంలో హుజురాబాద్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, స్వార్థం వీడి మానవత్వాన్ని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం విజయ్ కుమార్ను శాలువాతో సత్కరించి, ఆధ్యాత్మిక కవిత సారపు జ్ఞాపక, బొకే అందజేసి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, సిపిఐ నాయకులు శ్రావణ్, మలుగూరి ప్రభాకర్, బొడ్డు సంజయ్, తునికి వసంత్, నందగిరి శ్రీనివాస్, బాబురావు, వెంకటస్వామి సాయిల రాజు, జడల సమ్మయ్య, బండ నవీన్, చందు తదితరులు పాల్గొన్నారు.











