ఘనంగా నవభారతి విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబర్ 05
హుజురాబాద్: హుజురాబాద్‌లోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ఆవరణంలో పూర్వపు నవభారతి విద్యాలయం 2008–09 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా గడిపారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం వారి అనుభవాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమం గురించి నిర్వాహకులు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పాఠశాల గౌరవాన్ని మరింత పెంచిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి, అధ్యాపకులు నేపాల్, రమేష్, మధుకర్, సంపత్, రవీందర్, భిక్షపతి, కుమార్, విజయ సహా పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమ్మేళనం ముగిసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, స్నేహ భోజనం నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !