బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబర్ 05
హుజురాబాద్: హుజురాబాద్లోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ఆవరణంలో పూర్వపు నవభారతి విద్యాలయం 2008–09 పదవ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా గడిపారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం వారి అనుభవాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమం గురించి నిర్వాహకులు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పాఠశాల గౌరవాన్ని మరింత పెంచిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి, అధ్యాపకులు నేపాల్, రమేష్, మధుకర్, సంపత్, రవీందర్, భిక్షపతి, కుమార్, విజయ సహా పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమ్మేళనం ముగిసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, స్నేహ భోజనం నిర్వహించారు.










