బాహు బలంన్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 05: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత సీజేఐ (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని ధర్మసమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని పార్టీ పేర్కొంది. ఈ దాడిని క్షమించరాని నేరంగా భావించాలని ధర్మసమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజ్ మహారాజ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన మంద రాజ్ మహారాజ్, దేశంలో అత్యున్నత న్యాయ స్థానంలో ఉన్న వ్యక్తికే ఇలాంటి దుస్సంఘటన జరిగితే, ఇక సాధారణ సగటు పౌరుడు ఈ సమాజంలో ఎలా జీవించగలడని ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ దళితుడు అనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
“ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగినది కాదు, ఇది యావత్తు దళిత జాతికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం,” అని మంద రాజ్ మహారాజ్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో, దళిత సమాజం ప్రజా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మంద రాజ్ మహారాజ్ ఈ సందర్భంగా హెచ్చరించారు










