ఘనంగా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు..నివాళులు అర్పించి పలువురు కాంగ్రెస్ నాయకుల.

బాహుబలంన్యూస్ హూజురాబాద్,అక్టోబర్,05:
మాజీ కేంద్ర మంత్రి,దివంగత నేత
గడ్డం వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కాక వెంకటస్వామి తన జీవితాన్ని పేద ప్రజల సంక్షేమానికే అంకితం చేశారని కొనియాడారు. “అనుక్షణం పేదల కోసమే శ్రమించి, పల్లెల్లో, బస్తీలలో గుడిసెలు నిర్మించాలనే తలంపుతో పోరాడారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇంటి పేరునే మార్చుకుని గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న మహానేత” అని వక్తలు గుర్తు చేశారు.
కార్మిక లోకానికి ఆదర్శం
వెంకటస్వామి జీవితమంతా తెలంగాణ ప్రజల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసి, సింగరేణి కార్మికుల కోసం కార్మిక శక్తిగా ఎదిగారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన భారత కార్మిక లోకానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు దశరథం, బ్లాక్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, తౌసిఫ్ నర్సింగ్, సొల్లు సునీత, రిబ్క, మొలుగు రాధ, మధుకర్, రియాజ్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..