బాహు బలంన్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 08: పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ను మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS), మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
ప్రధాన డిమాండ్లు:
వికలాంగులకు పింఛన్ను ₹6,000కు పెంచాలి.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో సహా ఇతర పింఛనుదారులందరికీ పింఛన్ను ₹4,000కు పెంచాలి.
పూర్తి కండరాల క్షీణత (కండరాల బలహీనత) ఉన్నవారికి ₹15,000 ఇవ్వాలి.
అర్హులైన కొత్త లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి.
ఈ సందర్భంగా, MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ మాట్లాడుతూ, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు.










