రైతులకు యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ సెప్టెంబర్ 04: కమలాపూర్: రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా విమర్శించారు. రైతుల పట్ల ఈ రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధిని కోల్పోయాయని ఆయన ఆరోపించారు.
గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు యూరియా బస్తాలను అందించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని వాసు వడ్లూరి అన్నారు. రైతులకు సకాలంలో సహాయం అందించలేని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !