ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడికి సన్మానించిన సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు..

బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి,సెప్టెంబర్ 07;
కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గీకురు రవన్న ను సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ సమాజం బలోపేతానికి, సంక్షేమానికి రవన్న చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రేగుల అశోక్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు వస్తాదుల సదానందం ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల PRO గుళ్ల అజయ్ ముదిరాజ్, మరియు హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఇంచార్జ్ మద్ది పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులంతా రవన్నకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా ముదిరాజ్ సమాజం కోసం రవన్న మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !