బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి,సెప్టెంబర్ 07;
కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గీకురు రవన్న ను సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ సమాజం బలోపేతానికి, సంక్షేమానికి రవన్న చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రేగుల అశోక్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు వస్తాదుల సదానందం ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల PRO గుళ్ల అజయ్ ముదిరాజ్, మరియు హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఇంచార్జ్ మద్ది పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులంతా రవన్నకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా ముదిరాజ్ సమాజం కోసం రవన్న మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. 
Post Views: 64










