నూతన ఆర్టీవో భవన నిర్మాణం కోసం కృషి తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 03 : పట్టణంలో శిథిలావస్థలో ఉన్న రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ సందర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వోడితల ప్రణవ్ కోరిక మేరకు పడాల రాహుల్ ఈ పాత భవనాన్ని పరిశీలించారు.
హుజురాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త ఆర్టీవో భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని రాహుల్ తెలిపారు. వీలైనంత త్వరగా స్థలం కేటాయించి, భవన నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వేణు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, అర్జున్ గౌతం రెడ్డి, జప శ్రవణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !