నిరుపేదలకు అండ…జయన్న సేవ గుణం.. సొంత ఖర్చులతో నిరుపేదలకు వైద్యం.. జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 1: నిరుపేదలకు అండగా నిలవడంలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. స్వంత ఖర్చులతో పలువురు పేదలకు వైద్య సాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర భాగ్యమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జయన్న ఫౌండేషన్ స్పందించింది. ఫౌండేషన్ అంబులెన్స్‌లో భాగ్యమ్మను హుజూరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చుల బిల్లు తగ్గించారు. అంతేకాకుండా, చికిత్సకు అవసరమైన ఖర్చులను కూడా ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ రోజు భాగ్యమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా, సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి సేవలను సింగాపూర్, సిర్సపల్లి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. ఆమె సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….