నిరుపేదలకు అండ…జయన్న సేవ గుణం.. సొంత ఖర్చులతో నిరుపేదలకు వైద్యం.. జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 1: నిరుపేదలకు అండగా నిలవడంలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. స్వంత ఖర్చులతో పలువురు పేదలకు వైద్య సాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర భాగ్యమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జయన్న ఫౌండేషన్ స్పందించింది. ఫౌండేషన్ అంబులెన్స్‌లో భాగ్యమ్మను హుజూరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చుల బిల్లు తగ్గించారు. అంతేకాకుండా, చికిత్సకు అవసరమైన ఖర్చులను కూడా ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ రోజు భాగ్యమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా, సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి సేవలను సింగాపూర్, సిర్సపల్లి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. ఆమె సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..