బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 1: నిరుపేదలకు అండగా నిలవడంలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. స్వంత ఖర్చులతో పలువురు పేదలకు వైద్య సాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర భాగ్యమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జయన్న ఫౌండేషన్ స్పందించింది. ఫౌండేషన్ అంబులెన్స్లో భాగ్యమ్మను హుజూరాబాద్లోని ఒక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చుల బిల్లు తగ్గించారు. అంతేకాకుండా, చికిత్సకు అవసరమైన ఖర్చులను కూడా ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ రోజు భాగ్యమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా, సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి సేవలను సింగాపూర్, సిర్సపల్లి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. ఆమె సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.











