బాహు బలంన్యూస్ హుజురాబాద్,ఆగస్టు 29: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ నాయకులు వినాయకుడికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేలా ఆశీర్వదించాలని వారు వినాయకుడిని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా విద్యార్థుల కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, సుమారు రూ. 8300 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. దీనివల్ల కళాశాల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఇది ఉన్నత విద్యకు ఆటంకంగా మారిందని తెలిపారు.
హాస్టల్స్, గురుకులాల్లో సమస్యలు:
హాస్టల్స్లో కనీస వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందడం లేదని అజయ్ అన్నారు.
అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు.
మత్తుపదార్థాలు, ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు కోరుతూ..
పాఠశాలలు, కళాశాలల వద్ద గంజాయి లాంటి మత్తుపదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఫీజులు సకాలంలో అందకపోవడం వల్ల కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడుతున్నాయని అన్నారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ హుజురాబాద్లోని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కొయ్యల అంజి, నగర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.











