బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25:
‘ప్రజా జనహిత’ పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా, కరీంనగర్ జిల్లా ప్రజా జనహిత కార్యక్రమంలో భాగంగా, ఆమె మరియు ఇతర మహిళా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ నాయకుల ఈ పర్యటన కార్యకర్తల్లో కొత్త జోష్ను నింపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Post Views: 48










