ఇందిరమ్మ ఇళ్లలో బేడ బుడగ జంగాలకు అన్యాయం:బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఆగస్టు 25;
హుజురాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేడ బుడగ జంగం కులస్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 100 ఇళ్లు కూడా తమ వారికి మంజూరు కాలేదని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా తమ కులానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి పలు డిమాండ్లు:
గృహాలు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల జనాభా కలిగిన బేడ బుడగ జంగాల్లో 80% మంది ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారని, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా 10,000 ఇళ్లు తమ కులానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కూడా మరో 10,000 ఇళ్లను పైలెట్ ప్రాజెక్టుగా కేటాయించాలని కోరారు.
కార్పొరేషన్: ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-ఏలో ఉన్న 15 కులాలకు ఉపకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రధాన కులమైన బేడ బుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని, ఏడాదికి రూ. 5000 కోట్ల నిధిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆత్మగౌరవ భవనం: వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చే తమ కులస్థులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో 1000 గజాల స్థలం కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గుడి నిర్మాణం: తమ కులదైవం పెద్ద గుసాయి తాత జాతర నిర్వహణ కోసం కరీంనగర్ జిల్లాలో 5 ఎకరాల స్థలం కేటాయించి గుడి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వేణు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..