బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హుజూరాబాద్ మహిళా కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ, ‘ప్రజా జనహిత’ పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
సమావేశంలో పాదయాత్ర పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ పర్యటనతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గంగాధరలో శ్రమదానం
అలాగే, గంగాధర ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో జరిగిన శ్రమదానంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












