13వ వార్డు,అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి ఘన సన్మానం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జూలై 28: హుజురాబాద్ మున్సిపాలిటీ, 13వ వార్డు, ఇందిరానగర్ కాలనీలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి స్థానిక నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానం జరిగింది.
తాజాగా జరిగిన నియామకాలలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మోరె ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా కుక్కమూడి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి నియామకాన్ని పురస్కరించుకొని ఇందిరానగర్ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సన్మాన కార్యక్రమానికి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ముఖ్య అతిథిగా హాజరై, నూతన అధ్యక్ష, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహంకాళి కొమురయ్య, కొండ్ర మల్లయ్య, కొలుగూరి బిక్షపతి, మోర్ మహేష్, కొలుగూరి సమ్మయ్య, కొలుగూరి శ్రీను, మరియు వెలిశాల నారాయణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మోరె ఉపేందర్, కుక్కమూడి తిరుపతిలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వారి కార్యకలాపాలకు అన్ని విధాలా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.
అలాగే, యూత్ సభ్యులైన అరవింద్, నాగరాజు, సాగర్, గరిగె శివ, మోర్ కృష్ణ, హీరా సింగ్, బచన్ సింగ్, జీత్ సింగ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరానగర్ కాలనీ అభివృద్ధికి, యువత సంక్షేమానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. .





Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….