బాహు బలంన్యూస్ సైదాపూర్ జూలై 16:తెలంగాణ జనసమితి(టీజేఎస్) పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షుడిగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ నియామక పత్రాన్ని శ్రీనివాస్కు అందజేశారు.
మొలుగూరి శ్రీనివాస్ గతంలో తెలంగాణ జనసమితి విద్యార్థి, యువజన విభాగంలో వివిధ పదవుల్లో పనిచేశారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. శ్రీనివాస్కు ఈ అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు సూచించగా, ఎమ్మెల్సీ, టీజేఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు మొలుగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, జిల్లా అధ్యక్షులు మోరే గణేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్లకు కృతజ్ఞతలు తెలిపారు.










