తెలంగాణ జనసమితి సైదాపూర్ మండల అధ్యక్షుడిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం.

బాహు బలంన్యూస్ సైదాపూర్ జూలై 16:తెలంగాణ జనసమితి(టీజేఎస్) పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షుడిగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ నియామక పత్రాన్ని శ్రీనివాస్‌కు అందజేశారు.
మొలుగూరి శ్రీనివాస్ గతంలో తెలంగాణ జనసమితి విద్యార్థి, యువజన విభాగంలో వివిధ పదవుల్లో పనిచేశారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. శ్రీనివాస్‌కు ఈ అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు సూచించగా, ఎమ్మెల్సీ, టీజేఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు మొలుగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, జిల్లా అధ్యక్షులు మోరే గణేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….