కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం…

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 16 ]: వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న కాట్రపల్లి గ్రామ ప్రజలు వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని, పాడి పశువులు సమృద్ధిగా వృద్ధి చెందాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.

వేసవి కాలాన్ని తలపించేలా ఉన్న ప్రస్తుత వర్షాకాల పరిస్థితులతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భగవంతునిపై విశ్వాసంతో, తమ గ్రామ దేవతలైన హనుమాన్ దేవాలయం, సీతారామచంద్ర వారి దేవాలయం, శివాలయం, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి, పోచమ్మ తల్లి దేవాలయం, ఎల్లమ్మ తల్లి దేవాలయం, నాగేంద్ర స్వామి దేవాలయం, కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, దుర్గమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు తమ చేతులతో బిందెల కొద్దీ నీటిని తెచ్చి గుళ్లలోని దేవతా విగ్రహాలపై పోస్తూ, వానలు కురవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిటిసి రావుల అనిత వెంకట్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెరుమాండ్ల బిక్షపతి, కాసగొని కిరణ్, బాణాల కుమార్, బొల్లా చంద్రమౌళి, రావుల సురేందర్, ముప్పు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి వర్షాలు కురిసి, పంటలు పండి, పశు సంపద వృద్ధి చెందాలని గ్రామ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జలాభిషేకంతో వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..