కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం…

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 16 ]: వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న కాట్రపల్లి గ్రామ ప్రజలు వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని, పాడి పశువులు సమృద్ధిగా వృద్ధి చెందాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.

వేసవి కాలాన్ని తలపించేలా ఉన్న ప్రస్తుత వర్షాకాల పరిస్థితులతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భగవంతునిపై విశ్వాసంతో, తమ గ్రామ దేవతలైన హనుమాన్ దేవాలయం, సీతారామచంద్ర వారి దేవాలయం, శివాలయం, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి, పోచమ్మ తల్లి దేవాలయం, ఎల్లమ్మ తల్లి దేవాలయం, నాగేంద్ర స్వామి దేవాలయం, కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, దుర్గమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు తమ చేతులతో బిందెల కొద్దీ నీటిని తెచ్చి గుళ్లలోని దేవతా విగ్రహాలపై పోస్తూ, వానలు కురవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిటిసి రావుల అనిత వెంకట్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెరుమాండ్ల బిక్షపతి, కాసగొని కిరణ్, బాణాల కుమార్, బొల్లా చంద్రమౌళి, రావుల సురేందర్, ముప్పు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి వర్షాలు కురిసి, పంటలు పండి, పశు సంపద వృద్ధి చెందాలని గ్రామ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జలాభిషేకంతో వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….