బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 11
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ (RTI Sadhana Committee) హన్మకొండ జిల్లా నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ షేబారిష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మీసాల విజయ్ ప్రజల సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించా రు.సమాచార హక్కు చట్టం సాధన కమిటీ లక్ష్యాలను, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా తమ కమిటీ ఎలా పనిచేస్తుందో కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు మీసాల విజయ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు బొల్లం విజయ్, హన్మకొండ జిల్లా సెక్రటరీ కొంగంటి రాజ్కుమార్, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను సదానందం, కమలాపూర్ మండలం అధ్యక్షులు కోవరాజు సాగర్, పెనుకుల మోహన్, నరేష్, మహమ్మద్ గౌస్ ఖాన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 85










