బాహు బలంన్యూస్ హుజురాబాద్,జూలై 11,: సామాజిక ఉద్యమ నేత, గెజిటెడ్ రిటైర్డ్ హెడ్మాస్టర్ వేల్పుల రత్నంకు రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. రత్నం సమాజానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అతన్ని ఘనంగా సన్మానించారు.
మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, మరియు ఇల్లందుల రజిత తిప్పరపు రాజయ్య, శంకర్ లతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది కలిసి వేల్పుల రత్నంను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో రత్నం సేవలను కొనియాడారు. విద్యారంగంలో హెడ్మాస్టర్గా అతను చేసిన కృషి, సామాజిక ఉద్యమాలలో అతను నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు










