బాల కార్మికులను గుర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖ

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 10;
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గురు వారం రోజు హుజూరాబాద్, జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ) దుర్దాన పర్వీన్ మరియు ఆమె సిబ్బంది దుకాణాలు, ఇటుక బట్టీలను సందర్శించి అక్కడ పని చేస్తున్న బాలలను గుర్తించారు.
అదే విధంగా, కరీంనగర్ పట్టణంలో రెండు ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్) నమోదు చేయబడ్డాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ ఆపరేషన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !