బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతుల పక్షపాతి అని రుజువు చేసుకుందని, రైతు భరోసా పథకం రైతుల పాలిట పండుగైందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత అన్నారు. గతంలో “వరి వేస్తే ఉరి” అనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ “వ్యవసాయం దండగ కాదు పండగ” అని నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా పథకం కింద అన్ని వ్యవసాయ భూములకు అందజేస్తున్నారని పుష్పలత తెలిపారు. ఈ పథకంలో భాగంగా తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, ఇది రైతుల కళ్లల్లో ఆనందం నింపి పండుగ వాతావరణాన్ని సృష్టించిందని ఆమె అన్నారు. ఇప్పటివరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పుష్పలత చెప్పారు. గతంలో ఎన్నడూ రైతు భరోసా వేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.










