బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 25: హుజురాబాద్ మండలం, కనకలగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద తాపీ మేస్త్రీ,సగర ఉప్పర కులస్తుడు కురిమిండ్ల నారాయణ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఈ విషయం తెలుసుకున్న జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు.
మానవతా దృక్పథంతో నారాయణ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న జైపాల్ రెడ్డి, వారికి 50 కిలోల బియ్యంతో పాటు ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు కొల్లూరి బుచ్చయ్య, కానిగంటి శ్రీనివాస్, కురుమిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు.
జయన్న ఫౌండేషన్ అందించిన ఈ సహాయం పట్ల గ్రామస్తులు మరియు మృతుడి కుటుంబ సభ్యులు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. జైపాల్ రెడ్డి దాతృత్వాన్ని పలువురు ప్రశంసించారు.
Post Views: 222










